శ్రీ. జయేష్ రంజన్, ఐఎఎస్
డైరెక్టర్
శ్రీ. జయేష్ రంజన్ గారు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) 1992 బ్యాచ్ అధికారిగా ఉన్నారు మరియు ప్రస్తుతం అతను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సమాచార సాంకేతిక విభాగము (ఐటి) ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉంటున్నారు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు మమరియు వాణిజ్య విభాగము యొక్క ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉంటున్నారు.
అతను ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి మనస్తత్వ శాస్త్రములో ఒక మాస్టర్స్ డిగ్రీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, కలకత్తా నుండి బిజినెస్ మేనేజ్మెంట్ లో డిగ్రీ, మరియు సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ, లీ కువాన్ యూ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ నుండి పబ్లిక్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ పొంది ఉన్నారు.
అతను యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హ్యామ్ (పర్యావరణసంబంధిత పాలసీ విశ్లేషణపై), జికా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, టోక్యో (సరస్సుల నష్ట నివారణపై), లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (ప్రపంచీకరణ మరియు నాయకత్వముపై), కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్, హార్వార్డ్ యూనివర్సిటీ (పబ్లిక్ పాలసీపై), మరియు స్వీడిష్ ఇన్స్టిట్యూఇన్స్టిట్యూట్, స్టాక్హోమ్ (సుస్థిరత్వం మరియు CSR పై) లో స్వల్పకాలవ్యవధి కోర్సులను కూడా చేశారు.
అతను 1992 ఐఏఎస్ బ్యాచ్ యందు ఆలిండియా టాపర్ గా ఉన్నారు. అతనికి 2002 వ సంవత్సరంలో ప్రపంచ బ్యాంక్ యొక్క సోషియల్ క్యాపిటల్ విజిటింగ్ స్కాలర్షిప్ అవార్డు మరియు 2005లో బ్రిటిష్ ప్రభుత్వం యొక్క గురుకుల్ ఛెవెనింగ్ స్కాలర్షిప్ ప్రదానం చేయబడింది.
అతను ప్రపంచ బ్యాంక్, UN-ESCAP, మెక్సికో యొక్క సెడాటు ప్రాజెక్టు కొరకు, మరియు యుఎస్ఏ యొక్క YES, Inc మరియు ఇటలీ నుండి NMC వంటి యువత సమస్యల కొరకు పనిచేస్తున్న అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల కొరకు అంతర్జాతీయ సలహా సంప్రదింపుల అసైన్మెంట్లను చేశారు.
అతను భారత ప్రభుత్వముచే ఏర్పాటు చేయబడిన 'నాయకత్వంలో శిక్షకుల జాతీయ సమకూర్పు' లో భాగంగా ఉన్నారు, మరియు కొత్తగా నియమించబడిన సివిల్ సర్వెంట్స్ శిక్షణ మరియు మార్గదర్శకత్వంలో నిమగ్నమై ఉన్నారు.
తెలంగాణ ప్రభుత్వము యొక్క సమాచార సాంకేతికత (ఐటి) శాఖకు కార్యదర్శిగా అతని కార్యవ్యవహారాలు, వివిధ ప్రభుత్వ ప్రక్రియలలో ఐటి వినియోగపు అవకాశాలను గుర్తించడం, కొత్త పెట్టుబడులను ఆకర్షించడం, మరియు పౌరుల డిజిటల్ సాధికారతను పెంపొందించడం ఇమిడి ఉంటాయి. అతని గడచిన కొన్ని అసైన్మెంట్లలో ఇవి ఉన్నాయి: పారిశ్రామిక అభివృద్ధి పెంపుదల రంగములో పరిశ్రమల శాఖ కమీషనర్ మరియు మేనేజింగ్ డైరెక్టరుగా, పర్యాటక ప్రోత్సాహక పెంపుదల శాఖలో కార్యదర్శిగా, మరియు హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (హుడా) వైస్-ఛైర్మన్ గా అన్నింటికీ ఒక్కొక్కదానికి 2-3 సంవత్సరాల పాటు పని చేశారు, మరియు రాష్ట్రం లోని వివిధ ప్రాంతాలలో వివిధ గ్రామీణాభివృద్ధి వ్యవహారాల్లో 12 సంవత్సరాల పాటు గిరిజన అభివృద్ధి, సహజ వనరుల యాజమాన్యము, పేదరిక నిర్మూలన, మరియు ఇతర సంబంధిత సామాజికాభివృద్ధి వంటి వివిధ రంగాలలో పని చేస్తున్నారు.
శ్రీ. జయేష్ రంజన్ గారు అనేక సామాజిక, సాంస్కృతిక మరియు ధార్మిక దాతృత్వ కార్యాలకు తోడ్పడుతున్నారు, మరియు అతను యునైటెడ్ వే (హైదరాబాద్), సేవ్ ఎ ఛైల్డ్'స్ హార్ట్ (SACH) ఫౌండేషన్, యంగ్ లైవ్స్ ఇండియా, సేవ్ ది చిల్డ్రన్, స్పర్శ్ హాస్పీస్, ఎపిమాస్, ఎంఎల్ జయసింహ స్పోర్ట్స్ ఫౌండేషన్, హైదరాబాద్ 10 K ఫౌండేషన్, విజయా ఫౌండేషన్ ట్రస్ట్, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, LSN ఫౌండేషన్, తేజస్ ఫౌండేషన్, మ్యాజిక్ బస్ హైదరాబాద్, హాకీ హైదరాబాద్, వలర్ల్డ్ వైడ్ ఫండ్ (హైదరాబాద్ చాప్టర్), హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ మరియు స్పిక్-మ్యాకే బోర్డులు/సలహా మండళ్ళలో సభ్యులుగా ఉన్నారు.